గుడ్ మార్నింగ్ సీఎం సార్ నిద్ర మేల్కోండి: పెడన జనసేన

పెడన, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈనెల 15,16,17 తేదీలలో ఆంధ్రప్రదేశ్లో రోడ్ల అధ్వాన పరిస్థితిపై #GoodMorningCMSir ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెనింగ్ చేయాలన్నది పార్టీ ఆదేశం. అడుగుకి ఒక గుంత, గజానికో గొయ్య అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి. జనసేన పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై డిజిటల్ క్యాంపెనింగ్ చేయడం జరిగింది. వైసిపి ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా జులై 15, 2022 నాటికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లను మరమ్మతులు చేస్తాం. ఏ ఒక్క రోడ్డు మీద గుంతలు లేకుండా చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. కానీ ఏ ఒక్క రోడ్డుని మరమ్మత్తులు చేయని పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మరొకమారు ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి పై మొద్దు నిద్రపోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని నిద్ర మేల్కొల్పాలనె ఉద్దేశంతో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హేష్ ట్యాగ్ తో కార్యక్రమం వేయడం జరిగింది. గూడూరు ఎండిఓ ఆఫీస్ రోడ్ లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ పెద్దతన కార్యక్రమం జరిగింది. గూడూరు మండలంలోని తుమ్మలపాలెం వెళ్లే రోడ్డు పాడైపోయిన రోడ్ల పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మంత్రి జోగి రమేష్ మట్టి దోపిడిపై పెట్టిన శ్రద్ధ రోడ్లపై పెట్టకపోవడం దురదృష్టకరం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు, బత్తిన హరి రామ్, కూనసాని నాగబాబు, పండమనేని శ్రీనివాస్, శీరం సంతోష్, కనపర్తి వెంకన్న, సమ్మెటి శివ, ర్యాలీ సత్యనారాయణ, కొప్పినేటి శివమణి, పాశం నాగమల్లేశ్వరరావు, గల్లా హరీష్, పోతన గంగాధర్, దాసరి నాని, పినిశెట్టి రాజు పాల్గొనడం జరిగింది.