క్రియాశీలక సభ్యునికి భీమా చెక్కు అందజేసిన గాదె

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామంలో క్రియాశీలక కార్యకర్త కంకట చక్రంరావు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయాలవడం జరిగింది. కంకట చక్రంరావు జనసేనపార్టీ క్రియాశీలక సభ్యుడు కావడంతో వైద్య ఖర్చులు నిమిత్తం పార్టీ నుంచి 45,000/- రూపాయల చెక్కుని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు చాలా రాజకీయ పార్టీలు చూసాం. అందరూ కూడా ప్రజల్ని ఏ విధంగా వాడుకోవాలని చూసారే కానీ ప్రజలకు ఉపయోగపడిన వాళ్లు చాలా తక్కువ. జనసేన పార్టీ అనేది ప్రజల కోసం ఏర్పడినదే కానీ స్వార్థంగా అన్ని పార్టీలలాగా ఏర్పడిన పార్టీ కాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లూరి అప్పారావు, మేకల రామయ్యయాదవ్, దేశంశెట్టి సూర్య, మండల అధ్యక్షులు నాగిశెట్టి సుబ్బారావు, చింతలపూడి గ్రామ అధ్యక్షుడు సాయన్న ప్రభు సుధాకర్, పొన్నూరు మండల కమిటీ సభ్యులు తమ్మిర్చి సురేష్, వేముల నారాయణ, యకటి రామయ్య, షేక్ బుడే, చందు శివ కోటేశ్వరావు, కసుకర్రు గ్రామ అధ్యక్షుడు ఎలవర్తి వెంకటేశ్వరరావు, ఉప్పరపాలెం గ్రామ అధ్యక్షుడు గోవాడ మురళి, చింతలపూడి గ్రామ కమిటి సభ్యులు,
చుండూరు మధు, శ్యామ్, గౌస్, మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.