జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన దేవర మనోహర

చంద్రగిరి: ఇటీవల నియోజకవర్గాల వారిగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గం నుండి జనసేన పార్టీకి గాను యువ నాయకుడు గత సార్వత్రిక ఎన్నికల ముందు నుండి అహర్నిశలు పార్టీ అభివృద్ధికి మరియు నియోజకవర్గ ప్రజల సమస్యలపైన పోరాడుతున్న నాయకులు దేవర మనోహర ను చంద్రగిరి నియోజకవర్గ బాధ్యులుగా ప్రకటించిన అధిష్టానం. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ను మరియు ఇతర పార్టీ సీనియర్ నాయకులు కలిసిన సంగతి విదితమే, కాగా శనివారం ఆయన పార్టీ అధిష్టానాన్ని కలిసి వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. తాజాగా నేడు దేవర మనోహర జనసేన అధినతే కొనిదల పవన్ కళ్యాణ్ ను, పార్టీ ప్యాక్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారితో నియోజకవర్గ సమస్యలు మరియు రానున్న రోజుల్లో ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని మరింత బలపరిచేలా ఎలా కృషి చేయాలనే విషయమై చర్చించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన పార్టీ అధిష్టానం నిత్యం జనంతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని మరియు అధికారపార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు, వారి సూచనలను తీసుకున్న దేవర మనోహర తనని నమ్మి చంద్రగిరి ఇంఛార్జి గా అవకాశమిచ్చిన దానికి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, అందరినీ కలుపుకొని ఉమ్మడి అభ్యర్థి గెలుపును ఖాయం చేస్తామని తెలిపారు. జనసేన అధిష్టానాన్ని కలిసిన వారిలో చిత్తూరు జిల్లా యువ నాయకులు శ్రీ పగడాల యువరాజ్, చంద్రగిరి యువ నాయకులు నూనె దిలీప్ తదితరులు పాల్గొన్నారు.