చట్ట ప్రకారంగా చర్య తీసుకోకపోతే జనసేన తరపున ధర్నా

ఎచ్చెర్ల, నియోజకవర్గం జి.సిగడాం మండలానికి చెందిన నిద్దాం పంచాయతీ అద్దోనంపేట రోడ్డు విషయంపై నిద్దాం జనసేన సర్పంచ్ మీసాల రవి పోరాటం చేసినందుకు అక్కడ వైసీపీ దుండగులు వారిపై దాడి చేసిన విషయం తెలుసుకొని వెంటనే స్పందించి పోలీస్ స్టేషన్ కి గురువారం వెళ్లి పోలీస్ మండల అధికారైన ఎస్ఐ ని ప్రశ్నించి వెంటనే దీనిపైన చర్య తీసుకోమని అలాగే ఆ జె.సి.బి ని సీజ్ చేయమని గట్టిగా నిలదీయడం జరిగింది. అదే విషయంపై శుక్రవారం ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ మరియు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అర్జున్ భూపతి జి.సిగడాం మండల పోలీస్ స్టేషన్ కి వెళ్లి దీనిపై న్యాయం జరిగేంత వరకు చట్ట ప్రకారంగా మీరు చర్య తీసుకోవాలని లేకుంటే జనసేన పార్టీ తరఫున మేము ఇదే పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతాం అని గట్టిగా చెప్పి దీనికి న్యాయం జరిగేంత వరకు చట్టపరమైన బాధ్యత నిర్వహించాలని గట్టిగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇతరుల ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్, ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు అర్జున్ భూపతి అద్దోనం పేటమీసాల రామకృష్ణ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.