ఓటమి బయంతోనేనా ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది: మాదాల శ్రీరాములు

ఆరకు నియోజకవర్గం: జనసేన పార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి తప్పించగలరేమో గాని వారిని మీ ప్రభుత్వ హయం లో పెట్టిన ఇబ్బందులు మర్చిపోరు. విద్యని బోధించే వారిని మద్యం షాప్ ల ముందు పెట్టిన విషయం మర్చిపోతారా?, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ సీపీఎస్ రద్దు అమలు చేయాలని అడిగినప్పుడు మీరు పెట్టిన ఇబ్బందులు మర్చిపోతారా?. నేడు మీరు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు ఎలా మర్చిపోతారు. సీపీఎస్ గురించి ఉద్యమం చేస్తున్నారని అనేక బోధనేతర బాధ్యతలు అప్పగించి, ఐదేళ్లకొకసారి చేసే ఎన్నికల నుంచి వారిని తప్పించి మిరు ఎన్నికల ఓటమి నుంచి బయట పడాలని అనుకుంటున్నారా. ప్రభుత్వ ఉద్యోగులకు మీరు చేసిన అన్యాయం గురించి వారుగాని వారి కుటుంబ సభ్యులు గాని మర్చిపోయే అవకాశమే లేదు. మీరు మడమ తిప్పారనే ఏకమొత్తంలో ఎప్పుడూ లేనివిధంగా ఉద్యోగులంతా మీకు ఓట్లేస్తే వారికి మీరు మీ ప్రభుత్వం అంత అన్యాయం చేస్తారా?, మీరు ఒక్క ఛాన్స్ అని అడిగి అన్ని వర్గాల వారిని ఇంత మోసం చేస్తారా?. మీకు ఉద్యోగులు తగిన బుద్ధి చెప్తారని శ్రీరాములు డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించడాం జరిగింది.