ముమ్మిడివరం నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన టీడీపీ, రాష్ట్ర అధ్యక్షులు పిలుపుమేరకు ముమ్మిడివరం మండల జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్య పరిచే కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ముమ్మిడివరం మండలం, గున్నేపల్లి నుండి భీమనపల్లి వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా ఉన్నాదని, తక్షణం ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ జనసేన టిడిపి, పార్టీలు నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరైయ్యారు.

డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా కాట్రేనికోన మండలం కందికుప్ప నుండి బలుసుతిప్ప వెళ్లే రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని,తక్షణం ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ జనసేన టిడిపి, పార్టీలు నిరశన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరైయ్యారు

డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా కాట్రేనికోన మండలం నడవపల్లి నుండి గెద్దనపల్లి వెళ్లే రహదారి అధ్వాన్నంగా ఉన్నాదని తక్షణం ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ జనసేన టిడిపి, పార్టీలు నిరశన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు వీరమహిళలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరైయ్యారు.