జనసేన నాయకుడికి ఘనస్వాగతం

  • శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ విదేశాల నుంచి తిరిగి రాజంపేటకు వస్తుండగా గురువారం సిద్ధవటం మండల పరిధి ఉప్పరపల్లె గ్రామం వద్ద జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ.. ముందుగా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల్లో దిగ్విజయంగా కొనసాగిస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కులమతాలకు అతీతమైన పార్టీ జనసేన పార్టీ అని రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నారు. పవన్ కళ్యాణ్ రూపొందించిన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికులు అందరూ కష్టపడాలన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలందరూ, జనసేనను ఆదరించి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. జనసేన పార్టీ అధిష్టానం ఆమోదిస్తే, రాజంపేట నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన తెలియజేశారు. ఈకార్యక్రమంలో లీగల్ సెల్ కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, పోలిశెట్టి చంగల్ రాయుడు, పోలిశెట్టి శ్రీనివాసులు, జెడ్డా శిరీష జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.