ఉరవకొండ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

  • బెలుగుప్ప మండలంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి సారథ్యంలో ఆదివారం నిర్వహించిన గుంతల ఆంధ్రప్రదేశ్ దారేది కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు, తెదేపా నాయకులు

ఉరవకొండ: జనసేన పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పయ్యావుల కేశవ్ మరియు గౌతమ్ సూచనలతో బెలుగుప్ప మండలంలోని ఆవులెన్న – బెలుగుప్ప రోడ్డుపై ఉన్న గుంతలు చూపుతూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్, నాయకులు నాని, శేఖర్, రవినాయక్, మోహన్, ప్రణవసాయి తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పెద్దతిప్పయ్య, జిల్లా కార్యదర్శి మల్లికార్జున, తెలుగుదేశం పార్టీ ఆవులెన్న సర్పంచ్ రామ్మోహన్ మరియు తెలుగు యువత ప్రవీణ్ మరియు ఇరు పార్టీల నాయకులు పాల్గొన్నారు.