క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్స్ ముఖ్య సమావేశం

ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్స్ యొక్క ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఇమ్మడి కాశీనాధ్ నూతన వాలంటీర్ లకు సభ్యత్వం నమోదు చేసే విధానాన్ని, పార్టీ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం నమోదు వలన కలుగు ప్రయోజనాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని సూచనలు ఇచ్చారు.