ధర్మవరంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

ధర్మవరం: జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా 2వ రోజు ధర్మవరం పట్టణంలో బెంగళూరు రోడ్డు అరిగెల పోతన రైస్ మిల్ దగ్గర రోడ్ల దుస్థితిని పరిశీలించి రోడ్లు నిర్మాణం కాకపోవడం వలన జరుగుతున్న ప్రమాదాల గురించి తెలియజేసి మీడియా ముఖంగా జనసేన పార్టీ అభ్యర్థి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మరియు ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నాడని ప్రతిపక్షాలపైన ఉత్తర ప్రగల్బాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అలాగే 2024లో జనసేన, టిడిపి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.