జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో కాకినాడలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్
కాకినాడ రూరల్ నియోజకవర్గం, జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం కొరిపల్లి గ్రామంలో గుంతలు పడి మురుగు నీరు రోడ్డు మీదకు వచ్చి ప్రజలు ఇబ్బందులు! గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపైన్ నిర్వహించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ చెరియన్, నియోజకవర్గ నాయకులు సలాది శ్రీనివాసు బాబు, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి, మండలాల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు పాల్గొని రోడ్డు యొక్క దుస్థితిని పరిశీలించి అనంతరం స్థానిక ప్రజలను ఈ రోడ్డు వలన జరుగుతున్న ప్రమాదాలు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-18-at-19.44.09-1-1024x682.jpeg)
మళ్ళీ కానీ జగన్ వస్తే మన కిడ్నీలు అమ్ముకోవల్సిందే: శ్రీమతి పోలసపల్లి సరోజ
కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని స్వామి నగర్లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు సలాది శ్రీనివాసు బాబు, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి మరియు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి 17వ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు పలు సమస్యలను తెలియపరిచారు. అందులో ముఖ్యంగా పారిశుద్ధ్యలోపం వల్ల కుక్కలు, దోమలు బెడద ఎక్కువగా ఉంటుందని, మళ్ళీ కానీ జగన్ వస్తే మా కిడ్నీలు అమ్ముకోవల్సిందేనని వాపోయారు. అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-18-at-21.02.38-1024x682.jpeg)