గంగారపు రామదాసు చౌదరి ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

మదనపల్లె లో #GoodMorningCMsir రెండవరోజు కార్యక్రమంలో భాగంగా మదనపల్లె నడిబొడ్డున ఉన్న సంత దగ్గర రోజుకు వేలాదిగా వాహనాలు వస్తుంటాయి.. ఆ రోడ్డు దారుణ పరిస్థితి ని మరియు పొన్నూట్టపాల్యం రామిరెడ్డపల్లె, మిట్టామర్రి పనసమాకుల పల్లెలకి పోవు రోడ్డు పరిస్థితిని ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మండల ఆధ్యక్షలు గ్రానైట్ బాబు, టౌన్ కార్యదర్శి కుమార్, వేణు నాయక్ ఐ టి మోహన్ రాయల్ మహేష్ పాల్గొన్నారు.