జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణపై చర్చలు

కొండెపి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణపై చర్చలు టంగుటూరు మండల జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షులు కందుకూరి రాంబాబు మండల కమిటీని ఉద్దేశించి ప్రజ ల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానకి, బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గూర్చి, కార్యకర్తల సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు జనసేన సభ్యత్వ నమోదుకు ఏర్పాట్ల గురించి మండల కమిటీకి దిశానిర్దేశం చేయడం చేశారు. ఈ సమావేశానికి మండల ఉపాధ్యక్షులు మట్టా రమేష్, తోట చైతన్య ప్రశాంత్, గొల్లకారం రాము, అత్యాల సురేష్, రాజేష్, అవినాష్, చిరంజీవి, రాజశేఖర్, కృష్ణ, నీలిశెట్టి వాసు, జైరాజ్, వినోద్, జనసేనా మండల వీరమహిళ శ్రీ విద్య మరియు జనసేన క్రియాశీలక కార్యకర్తలు పాల్గొని తగు సూచనలు, సలహాలు మండల కమిటీకి ఇవ్వడం జరిగింది.