దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజా ప్రజాక్షేత్రంలో రండి: మధిర జనసేన

మధిర, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న కుట్రలను తీవ్రంగా ఖండించిన మధిర నియోజకవర్గ జనసేన పార్టీ. ఈ సందర్భంగా బోనకల్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విప్లమైందని ఈ గుర్తుతెలియని వ్యక్తుల్ని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వారి చర్యలు తీసుకొని వారి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. అదే అదేవిధంగా మొన్న విశాఖపట్నంలో సంఘటన మనందరం చూసాం ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఒక పార్టీ అధినేతకి ప్రచారానికి వస్తే కరెంటు తీసేసిన దౌర్భాగ్యం జగన్ రెడ్డి ప్రభుత్వానిది. పవన్ కళ్యాణ్ కి ప్రజా ఆదరణ పెరగటం వల్ల వైసీపీ చేస్తున్న కుట్రలు మరియు ఏదైతే రెక్కీ నిర్వహిస్తా ఉన్నారో ఇది వైసిపి ప్రభుత్వం చేస్తున్న భౌతిక దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబడ్దార్ వైఎస్ఆర్సిపి మధిర నియోజకవర్గ జనసైనికులు సవాలు విసురుతా ఉన్నాం మీకు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజా ప్రజాక్షేత్రంలో రండి మీ బలం ఏంటో మా బలవెంటో చూసుకుందాం. అంతేగాని భౌతిక దాడులు చేయాలని చూస్తే మీ కంటే మేము ఎక్కువ భౌతిక దాడులు చేయగలుగుతాం కానీ పవన్ కళ్యాణ్ ప్రజా సేవలో మనం ఉండాలని మాకు ఏదైతే నేర్పించారో అదేవిధంగా ఎవరికో భయపడో ఇక్కడ పవన్ కళ్యాణ్ లేరు అదే విధంగా దేశంలో నాలుగు మూలల ఉన్నటువంటి జనసైనికులు పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు వదిలేయడానికి కూడా జనసైనికులు సిద్ధంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ సూర్యుడు లాంటి వాడు జనసైనికులు నక్షత్రం లాంటి వాళ్ళు సూర్యుణ్ణి అంటుకోవాలని చూస్తే మాడి మసైపోతారని ఏ ప్రభుత్వమైనా పవన్ కళ్యాణ్ మీద కుట్రలు చేస్తే ఏ ప్రభుత్వాన్ని అయినా బంగాళాఖాతంలో కూలదోయటానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల సహాయ కార్యదర్శి ఎస్కే బాజీ బాబా, మండల కార్యదర్శి అద్దంకి సంతోష్ కుమార్, మండల ఎక్సిక్యూటివ్ మెంబర్, ఎస్కే జానీ పాషా తదితరులు పాల్గొన్నారు.