వికటించిన అమ్మఒడి

  • వైసిపి నవరత్నాల్లో ప్రతిష్టాత్మక “అమ్మఒడి” పథకం వికటించింది: అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్, వాసగిరి మణికంఠ మాట్లాడుతూ ప్రభుత్వం కుంటిసాకులు వెతుకుతూ అమ్మ ఒడి పథకం లక్ష మందికి పైగా లబ్ధిదారులను అనర్హులుగా తేల్చడంతో ఆందోళన చెందుతున్న విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు. అయితే ఈ పథకం కింద 100% లబ్ధిదారుల ఖాతాల్లో కూడా 2 వేలు కోత పెడుతూ రూ.13వేలు మాత్రమే ప్రభుత్వం జమచేయనుంది.

💥 “విద్యుత్తు వాడకం నెలకు 300 యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం అందదు.
💥 బియ్యం కార్డు కొత్తది ఉండాలి.
💥 కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌లో జిల్లా పేరును మార్చుకోవాలి.
💥 బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేవో విద్యార్థుల తల్లిదండ్రులు తనిఖీ చేసుకోవాలి” అంటూ ఇలాంటి అర్థంపర్థంలేని నిబంధనల కారణంగా వైసిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందికి పైగా విద్యార్థులు అమ్మఒడి పథకానికి అనర్హులయ్యారని ప్రభుత్వం ప్రకటించింది, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అన్న ముఖ్యమంత్రి మాకు బుద్ధోచ్చేలా చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ నయవంచక ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తామని నిరుపేద ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.