Rajamahendravaram: 14వ వార్డు లో క్రియాశీలక సభ్యులకు జనసేన భీమా పత్రాలు

పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు భీమా పత్రాలు, ఐడీ కార్డులతో కూడిన కిట్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం రాజమండ్రి 14వ వార్డులో వీరమహిళ శ్రీమతి యందం ఇందిర ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ జరిగింది. కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శులు జామి సత్యనారాయణ, తేజోమూర్తుల నరసింహమూర్తులు ముఖ్యఅతిధులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాసరి గురునాథరావు, అల్లంకి నాగేశ్వరరావు, ప్రకాష్, భాషా, సతీష్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.