Razole: 8వ రోజు క్రియాశీల సభ్యత్వ నమోదు కిట్లను అందజేసిన రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు

పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొన్నమండ గ్రామంలో రాజోలు మండలం పరిషత్ ఉపాధ్యక్షుడు ( వైస్ ఎంపీపీ) ఇంటి పల్లి ఆనందరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ MPTC దార్ల కుమారి లక్ష్మి చేతుల మీదుగా క్రియాశీలక సభ్యులుగా చేరిన కార్యకర్తలకు 8వ రోజు సభ్యత్వ నమోదు కిట్లను పంపిణి చేశారు. ఈ యొక్క కిట్ లో సభ్యత్వ నమోదు కార్డుతో పాటు, 5 లక్షల ప్రమాద భీమా పత్రం, పార్టీ యొక్క 7 సిద్ధాంతాలతో కూడిన పవన్ కళ్యాణ్ ఫొటో, అధ్యక్షుల వారి మనోగతం యొక్క వివరాలు, ఒక నోట్ బుక్ అందించారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారి ఇంటికెళ్లి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోఅల్లు బాలాజీ, కర్నీడీ సతీష్ బాబు, జవ్వాది రామ సాగర్, కొడవటి కనకారావు, కోర్లపాటి శ్రీనివాసరావు, యర్రం శెట్టి శ్రీనివాస రావు, అల్లు శివకృష్ణ మూర్తి, అల్లు దుర్గాంజనేయులు, అల్లు మహేంద్ర,లీల మానస మురళి కృష్ణ, కిరణ్ సాయి, నాగ వెంకట రామ, హరిదాస్ నరసింహారావు, ఆంజనేయ కుమార్, వెంకట సూర్య నవీన్, బాల హనుమాన్, నాగ ప్రసాద్, సత్యనారాయణ మూర్తి, ప్రసాద్, దుర్గారావు, రాంబాబు, శ్రీనివాస్, దుర్గాప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.