జనసేన వనరక్షణలో 1000 కొబ్బరి మొక్కల పంపిణీ

  • జనం కోసం జనసేన 580వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 580వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, అచ్యుతాపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1000 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 9800 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 581వ రోజు కార్యక్రమం బుధవారం కిర్లంపూడి మండలం, రామచంద్రపురం గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర తెలిపారు. మంగళవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, అచ్యుతాపురం గ్రామం నుండి బొద్దపు చంద్రరావు, బొద్దపు వీరబాబు, లక్ష్మి నాగేశ్వరరావు, కొత్తపల్లి బాపన్నదొర, అడపా విజయ్ కుమార్, శంక వీరబాబు, జాజుల వెంకన్నబాబు, వీరలంకపల్లి నుండి సుంకర తాతారావు, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, బట్టా దుర్గాప్రసాద్, వెంగయ్యమ్మపురం నుండి మరిశే వెంకటేష్, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, డేగల రాంబాబులకు పాటంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.