జనసేన వనరక్షణలో 1350 కొబ్బరి మొక్కల పంపిణీ

  • జనం కోసం జనసేన 569వ రోజు

జగ్గంపేట: నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 569వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం శుక్రవారం గండేపల్లి మండలం సింగరంపాలెం మరియు జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1350 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 3050 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 570వ రోజు కార్యక్రమం శనివారం గండేపల్లి మండలం, నాయకంపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. శుక్రవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బి.సి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి తోటకూర నూకరాజు, సింగరంపాలెం గ్రామం నుండి కుక్కల సురేష్, గుంటుపల్లి సూరి, బైపా సందీప్, ఇస్సాపు లోవగణేష్, ఇస్సాపు నాగేంద్ర, మర్రి ప్రకాష్, రాండి మనీష్, టెంక సుధీర్, నొక్కు దయప్రసాద్, కొప్పుల నాగరాజు, ఇస్సాపు వంశీ, సంకుమల్ల చినబాబు, గాలి నాగేంద్ర, నూకతట్టు నవీన్, బోయిడి మురళి, సుందరపల్లి లోవరాజు, రాండి రాజేష్, రాండి రాజు, కాకర వీరబాబు, మర్రిపాక నుండి పాటంశెట్టి శ్రీనివాస్, పాటంశెట్టి లోవరాజు, ఉరమళ్ళ శ్రీను, కాపవరపు పండు, వజ్రంగి వీరబాబు, వజ్రంగి దొరబాబు, వజ్రంగి కిషోర్ కుమార్, వజ్రంగి కిరణ్ కుమార్, కానూరి బాబి, ద్వారపూడి శివ, తచ్చోలు ప్రకాష్, సూర్నీడి మణికుమార్, మల్లేపల్లి నుండి నూకలబంటు రామకృష్ణ, రామవరం నుండి దివిటీ నగేష్, వెంగయ్యమ్మపురం నుండి అప్పాన అప్పారావు, రామచంద్రపురం నుండి పసుపులేటి వీరబాబు, గొల్లలగుంట నుండి గంజా శ్రీనివాస్, రాజపూడి నుండి నమ్మి చరణ్, గింజాల వీరబాబు, బూరుగుపూడి నుండి పాటంశెట్టి చిన్న రామకృష్ణ, కోడి గంగాధర్, పిన్నం మణికంఠ స్వామి, పెద్ది మణికంఠ, తుంపాల పవన్, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని లకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కె. గోపాలపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన బొబ్బర కృష్ణార్జునుడు కుటుంబ సభ్యులకు, కర్రి కృష్ణ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.