వల్లూరు గ్రామంలో మహాత్మునికి ఘన నివాళి

ఆచంట నియోజకవర్గం, వల్లూరు గ్రామంలో జనసేనపార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్బంగా సంతమార్కెట్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యతిధిగా జనసేనపార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ పాల్గొన్నారు, జనసేన పార్టీ నియోజకవర్గం సీనియర్ నాయుకులు తోట తాతాజీ, ఏడిద బాలు, కొముజు బ్రమ్మాజీ, దొమ్మెటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.