చక్రద్వారబంధం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

రాజానగరం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం చక్రద్వారబంధం గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకున్న కుటుంబాలను కలిసి వారికి స్వయంగా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో చక్రద్వారబంధం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.