రామభద్రపురంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

బొబ్బిలి నియోజకవర్గం: రామభద్రపురంలో జనసేన పార్టీ మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ కిట్లను జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహన కార్యదర్శి మహంతి ధనుంజయ ఆధ్వర్యంలో సభ్యత్వం నమోదు చేసుకున్నవారికి అందచేయటం జరిగింది. ఈ సందర్భంగా ధనుంజయ మాట్లాడుతూ క్రియాశీలక సభత్వం తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుపుతూ 5 లక్షలు రూపాయలు ప్రమాద భీమా, 50 వేల రూపాయల వరకు ప్రమాద సమయంలో వైద్య ఖర్చులకు భీమా వస్తుందని తెలియచేసారు. అలాగే 2024 లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు, గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు, రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో రూ 2500 – 3500/- వరకు నగదును అందిస్తారని అందువలన రాబోయే ఎన్నికలలో గ్లాస్ గుర్తుకు ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాలని మహిళలకు మహంతి ధనుంజయ వివరించారు.