జనసేన పార్టీలో చేరిన ముల్కనూర్ గ్రామ యువకులు

తెలంగాణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు పార్టీ సిద్ధాంతాలు నచ్చి, చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలోని యువకులు, నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలోకి చేరిన యువతకు సముచిత స్థానం ఉంటుందని, మీకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు మండల అధ్యక్షుడు గుండా సాయి చంద్, గుజ్జేటి సాయిరాం, కాసర్ల శ్రీకాంత్, కత్తెరమల్ల శ్రీకాంత్, బూస విజయ్, జెట్టి శ్రీనివాస్, కయ్యం సాయి, మారెల్ల అంజి, కయ్యం అజయ్, ఇరుకుల స్రృజన్, మల్యాల అక్షయ్, బుత్కూరి అభి, కయ్యం నరేందర్, మల్యాల నాని, జల్లెల రవి, బూస భరత్ తదితరులు పాల్గొన్నారు.