సత్తుపల్లిలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తెలంగాణ, సత్తుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండి నరేష్ ఆధ్వర్యంలో ఆదివారం సత్తుపల్లి కళాభారతి ఆడిటోరియంలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి వివిధ మండలాల నుండి కార్యకర్తలు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు శివాజి మిరియాల, ప్రధాన కార్యదర్శి కొమ్మగిరి శరత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జయచంద్ర గుప్త, అనిల్ సూరిశెట్టి, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ జబీర్ సయ్యద్, విద్యార్థి విభాగ నియోజకవర్గ నాయకులు కౌశిక్, సత్తుపల్లి మండల ప్రధాన కార్యదర్శి శివ, వైస్ ప్రెసిడెంట్ సింగపోగు అప్పారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణు నూతల అనూష, దార్ల రవి వర్మ, సెక్రటరీ సైఫ్ అలీ ఖాన్, వలపుల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.