సీతానగరంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

రాజానగరం నియోజవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో బుధవారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకున్న కుటుంబాలను కలిసి వారికి స్వయంగా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతానగరం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.