చెయ్యేరు గ్రామంలో పలువురిని పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: కాట్రేనికోన మండలం, చెయ్యేరు గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన బసవా రత్నంకాపు కుటుంబ సభ్యులను, చెయ్యేరు జల్లగుంట గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన సూదా రాముడు కాపు కుటుంబ సభ్యులను, చెయ్యేరు కాలవ గట్టుకు చెందిన ఇటీవల మరణించిన పోలిశెట్టి సత్యవేణి కుటుంబ సభ్యులను, చెయ్యరు గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన నవుండ్రు చందర్రావు, నవుండ్రు మణి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించి, ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండల కమిటీ సభ్యులు మరియు చెయ్యేరు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.