గంధం శెట్టి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రైల్వే కోడూరు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు రైల్వే కోడూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ రాజకీతనాయకుడు చేయని పని, కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కౌలు రైతులకు సాయం చేసారు. సుమారు 30 కోట్ల రూపాయలను దాదాపు 3,000 మంది కౌలు రైతులకు సహాయం చేసే ఉద్దేశంతో ఇప్పటివరకు ఏడు విడతలుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంపిణీ చేశారు అన్నారు. జనం సొమ్మును పన్నుల రూపంలో సేకరించి.. వాటినే సొంత జేబులోంచి ఇస్తున్నట్లు అమ్ముడుపోయిన మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజలకు ఏమార్చుతున్న రాజకీయ పార్టీలు ఉన్న ఈ రోజుల్లో… స్వచ్ఛమైన మనసుతో కార్యకర్తలగా మారిన సామాన్య ప్రజానీకాన్ని కూడా సంతోషపెట్టే ఉద్దేశంతో వారికి ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని జనసేన పార్టీ కనిపిస్తుందన్నారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ వారాహియాత్ర పూర్తయిన తర్వాత ఎన్నికలు మేనిఫెస్టో ప్రజలకు విడుదల చేసిన తర్వాత రాజకీయ ముఖచిత్రం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా మారిపోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయి దినేష్, సునీత తదితరులు పాల్గొన్నారు.