బొబ్బేపల్లి సురేష్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో.. శుక్రవారం క్రియాశీలక సభ్యత్వం కిట్లు 100 మందికి అందించడం జరిగింది. వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీ ఇంతలా ఆలోచించి జెండా మోసే కార్యకర్తల కుటుంబాలకి రక్షణ కల్పించాలనే ఆలోచన లేని వ్యవస్థ లో.. ఈ రోజు జనసేన జెండాలు మోసే కార్యకర్త కి ఏమైనా ఆపద వస్తే దానికి జనసేన ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉంటాను అని క్రియాశీలక సభ్యత్వానికి నమోదు చేయించి ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యులు పార్టీలో భాగస్వామిగా వారికి పార్టీ రక్షణ వలయంలాగా ఉండే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ జాయిన్ అయితే 50 వేల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించే అవకాశం కల్పిస్తూ.. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి ఒక శక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ కార్యక్రమంలో ముత్తుకూరుమండల అధ్యక్షులు మనుబోలు గణపతి, రహీం భాయ్, సునీత, నాగరాజు, వీరబాబు, రంజిత్, సందీప్, వంశీ, శ్రీహరీ తదితరులు పాల్గొన్నారు.