నందికొట్కూరులో జనసేన-తెలుగుదేశం ఆత్మీయ సమావేశం

ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మంగళవారం జనసేన-తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానంద రెడ్డి, జనసేన పార్టీ నందికొట్కూర్ నియోజకవర్గ సమన్వయ కమిటీ లీడర్ నల్లమల రవికుమార్, నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరు వెంకటరెడ్డి, హాజరయ్యారు. ఈ సమావేశంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మరియు అధికార పార్టీపై వ్యతిరేకతను ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయాలని జనసేన తెలుగుదేశం పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు.