తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

నెల్లూరు: దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పార్టీలో పనిచేస్తున్న క్రియాశీలక సభ్యుని కుటుంబానికి ఆర్థిక భరోసా కలిగిస్తూ 5 లక్షల రూపాయల యాక్సిడెంట్ బీమా సౌకర్యాన్ని కల్పించిన ఏకైక రాజకీయ పార్టీ జనసేన అని ఆ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా, చిట్టమూరు మండల పరిధిలోని కోగిలి గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన జనసేన కిట్లను అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రతో జగన్ ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తధ్యమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని పార్టీ శ్రేణులకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేనకు ఓట్లు వేయాల్సిన ఆవశ్యకతను తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండలం నాయకులు అక్బర్, వాసు, క్రాంతి, శరత్, రాము, ప్రవీణ్, వినోద్, సుబ్బు, గురు, సిద్దు, ఇంద్రవర్ధన్, రాజశేఖర్, శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు.