ప్రజా గాయకులు, పేద ప్రజల గొంతుక గద్దర్ అన్నకు జోహార్లు

శేరిలింగంపల్లి: నిరంతరం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తూ తన మాటల ద్వారా తన పాటల ద్వారా ఎంతో మందిని చైతన్యం పరిచిన గద్దర్ కు శేరిలింగంపల్లి జనసేన ఇంచార్జ్ డా. మాధవరెడ్డి ఆదేశాల మేరకు జనసేన ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా నాయకులు, పేద ప్రజల గొంతుక గద్దర్ అన్న అకాల మరణం విచారకరం. వారి మరణం తెలంగాణ ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాల వారికి తీరని లోటు. గద్దర్ గారి అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూన్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరిమహిళ దాక్షాయణి, నాయకులూ మల్లేష్ ముదిరాజ్, హనుమంత్ నాయక్, సేవ్య నాయక్, మొత్య నాయక్, గాంది, రఘ, వినీష్, మణ్యమ్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.