జనసేన మండల కమిటీ నియామక పత్రాల పంపిణీ

గుంటూరు: జనసేన పార్టీ మండల ఆఫీసులో మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో.. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో మండల కమిటీ సభ్యులకు నియామక పత్రాల పంపిణీ చేయడం జరిగింది. తదనంతరం పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో గ్రామ అధ్యక్షుడు పసుపులేటి నరసింహారావు ఆధ్వర్యంలో.. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… గురజాల నియోజకవర్గంలో పార్టీ బలంగా ముందుకు వెళుతుందని, జిల్లా మండల, గ్రామ స్థాయి కమిటీలు పూర్తిస్థాయిలో కంప్లీట్ అవుతున్నాయని, రానున్న రోజుల్లో జనసేన పార్టీ గురజాల నియోజకవర్గంలో బలమైన పార్టీగా అవతరించబోతుందని, అధికార ప్రతిపక్ష పార్టీలు కేవలం సవాళ్లు ప్రతిష్ట వాళ్ళకే పరిమితమయ్యారని, అభివృద్ధి పూర్తి స్థాయిలో వెనకబడిందని, ప్రజలు కచ్చితంగా ఈసారి మార్పు కోరుకుంటారని ఆ మార్పు కేవలం జనసేన ద్వారా మాత్రమే సాధ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వీరమహిళలు పాల్గొన్నారు.