గ్రామ గ్రామాన జనసేన పార్టీ ఉచిత వైద్య శిబిరం

రాజోలు నియోజకవర్గం: జనసేన నాయకులు, సర్పంచ్ మరియు విజయ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రాపాక రమేష్ బాబు సౌజన్యంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం కేశనపల్లి గ్రామం, తుఫాను ఆశ్రయ భవనం కళ్యాణ మండపం నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా షుగర్, బీపీ, గుండెకి సంబంధించి మరియు చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధులకు, స్త్రీల వ్యాధులకు, మొదలైన రక్త పరీక్షలు చేసి, ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగోలు సత్యనారాయణ (పెద్దబ్బులు) ముఖ్య అథిదిగా విచ్చేసి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సుమారు 140 మంది పైగా ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు, కేశనపల్లి గ్రామ జనసైనికులు, జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.