ముమ్మిడివరంలో అట్టహాసంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

*పవన్ కళ్యాణ్ ను సి.ఎం.చేసేందుకు ప్రతీకార్యకర్త అంకితభావంతో కృషిచేయాలి.. పితాని బాలకృష్ణ

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం: ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ రాష్ట్ర పి.ఎ.సి.సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ పితాని బాలకృష్ణ సమక్షంలో వాలంటీర్లు కు సన్మానం.. పార్టీ ప్రచారసామగ్రి కిట్లు పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతీరోజూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

ఇప్పటివరకూ 6868 సభ్యత్వాలు నమోదుతో ముమ్మిడివరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసేందుకు వాలంటీర్లు కృషి అబినందనీయం..అన్ని వర్గాలను పార్టీ చేరువుచేసేందుకు మరింత కలిసి కట్టుగా కృషి చేద్దాం అని పితాని పిలుపు నిచ్చారు.

ఎం.ఎల్.ఎ.లకు సి.ఎం.జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయడంకాదు.. జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతో ఎం.ఎల్.ఎ.లు ప్రజల్లోకి వచ్చేందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎం.ఎల్.ఎ.లే జగన్మోహన్ రెడ్డి కి తెలియచెప్పేరోజులు వస్తున్నాయి అని పితాని బాలకృష్ణ ఎద్దేవా చేశారు.