సింగనమలలో ఘనంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

సింగనమల: జనసేన పార్టీ అధినేత వవన్ కళ్యాణ్ ఆదేశాలతో జిల్లా అద్యక్షులు టి సి వరుణ్ సూచనల మేరకు.. జిల్లా ఉపాధ్యక్షులు కుంటిమద్ది జయరామి రెడ్డి పర్యవేక్షణలో సింగనమల నియోజకవర్గం లోని మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ వీరభద్రస్వామి దేవాలయము నందు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం చేసుకున్న వారికి సభ్యత్వ కిట్లను.. 5 లక్షల ప్రమాద భీమా పత్రాలను పంపిణీ .. మరియు క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వాలంటీర్లు గాండ్ర గొడ్డలి ఎర్రిస్వామి, సిరిసాల సుమన్ రాజ్ లకు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంకు ముఖ్య అథితులుగా జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అద్యక్షులు గుండా మురళీ కృష్ణ, రాయలసీమ కమిటీ సబ్యరాలు పసుపులేటి పద్మావతి, మరియు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సాకే.మురళీ కృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్పా, చంద్ర శేఖర్, జిల్లా సంయుక్త కార్యదర్శి డి.కే. విజయలక్ష్మి నాయకులు పెద్ది రాజు, తాహిర్, కమల్, సాయి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.