కట్ట ముత్యాలమ్మ తల్లి భక్తులకు మజ్జిగ పంపిణీ

రంపచోడవరం, వి.ఆర్.పురం, క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మంగళవారం వి.ఆర్.పురంలో గల కట్ట ముత్యాలమ్మ తల్లి వారి ఆలయం వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా నడవాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మండలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శులు బాగుల అంజనరావు, పెట్ట నాగేంద్ర, యూత్ నాయకులు పెడపెట్ల పవన్ కళ్యాణ్, పరంకుశం మణికంఠ, ముంజపు సాయి కోట్ల సాయిబాబు, పెడపెట్ల సాయిరాం, అచ్చిరాజు, కోట్ల వినయ్ మరియు పెద్దయెత్తున భక్తులు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.