టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ ల పంపిణీ

కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ మండలం, రమణయ్యపేట రాయుడుపాలెం లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ సహకారంతో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రంలో 120 మంది శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తాటికాయల వీరబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. రెండు బ్యాచ్లు శిక్షణ పూర్తి చేసుకుని మహిళలు ఏ విధంగా శిక్షణ పొందారో పంతం నానాజీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ తదేకం ఫౌండేషన్ సభ్యులు మాధవి గారు, సుధ గారు శాండీ గార్ల సహకారంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తూ మహిళలను వారి కాళ్ళపై వారు నిలబడేలా తీర్చిదిద్దుతు వారి కాళీ సమయంలో ఆర్ధికంగా నిలబడేలా చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్ లో జనసేన ప్రభుత్వం వచ్చాక శిక్షణ పొందిన మహిళలతో వస్తువులు, బట్టలు తయారు చేయించి మార్కెటింగ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.