త్రికోటేశ్వర స్వామి తిరుణాల విద్యుత్ ప్రభలను ప్రారంభించిన జనసేన నాయకులు

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి తిరుణాల సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి మరియు పోలేరమ్మ తల్లి గుడి నుండి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి తిరునాళ్లకు బయలుదేరే విద్యుత్ ప్రభల కమిటీ పెద్దల ఆహ్వానం మేరకు రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు హాజరై, కొబ్బరికాయ కొట్టి ప్రభల ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.