బాబు పాలూరు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

ఉమ్మడి విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో జనసైనికుల నిలయం మరియు కోట జంక్షన్ దగ్గర వినాయక చవితి సందర్భంగా ఆదివారం భక్తులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగధర్, బొబ్బిలి మెగా ఫ్యామిలీ అధ్యక్షులు లంక రమేష్, జనసేన నాయకులు అడబాల నాగు, రేవళ్ళ కిరణ్, హరిచరణ్, ఎందవ సత్య, పల్లెం రాజా, చీమల సతీష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.