జనసేన వనరక్షణలో కొబ్బరి మొక్కల పంపిణీ

  • జనం కోసం జనసేన 575వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 575వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం గురువారం కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 800 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 5800 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 576వ రోజు కార్యక్రమం శుక్రవారం కిర్లంపూడి మండలం, ముక్కొల్లు గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. గురువారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, ముక్కొల్లు నుండి జోళ్ళ విఘ్నేశ్వరరావు, చీకట్ల సుబ్రహ్మణ్యం, నేరెళ్ళ మణికంఠ, దాసం మణికంఠ, రావు వీరభద్రరావు, రావు చంటిబాబు, కొంతం లోవ, అక్కిరెడ్డి శ్రీరామ్, జలసూత్రపు మణికంఠ, కిర్లంపూడి నుండి నాగబోయిన శివ, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు, మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఆర్&ఆర్ కాలనీ గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన చారపు వెంకట రాయుడు కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.