నీటి కొరత తీరుస్తున్న గర్భన సత్తిబాబు

పాలకొండ, రెండు రోజుల నుంచి వర్షాల కారణంగా కరెంటు లేకపోవడంతో ప్రజలు పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అందులో ముఖ్యంగా త్రాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూసి పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు సోమవారం చిన్న మంగళాపురం గ్రామంలో ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే వాటర్ ట్యాంక్ తెప్పించి నీటి కొరత నుండి ఉపశమనం కల్పించారు. ఈ కార్యక్రమంలో డొంక శివ ప్రసాద్, బలగ విరపు నాయుడు, యేన్ని గౌరినాయుడు, విజయ్ కుమార్, గణేష్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.