సర్వేపల్లి జనసేన ఆధ్వర్యంలో పానకం పంపిణీ

సర్వేపల్లి, వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీరామ నవమి సందర్భంగా గురువారం పానకం పంపిణీ చేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ 2024లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ శ్రీరామ చంద్రమూర్తి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా రామరాజ్యం ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడబోతున్నారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను విముక్తి చేయడం జనసేన లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ప్రతి ఒక్క జన సైనికుడు గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దానికి ముందుకు వెళ్తున్నాం. ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే విధంగా రాష్ట్రాన్ని అవినీతి రహిత అభివృద్ధి దిశలో నీతి నిజాయితీగా ముందుకు తీసుకు వెళ్లే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమవుతుంది అని ప్రజలందరూ భావిస్తున్నారు. అది నిజం అవుతుంది ఆదిశగానే పరిపాలన కూడా కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీమ్, అక్బర్, చిన్న, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.