వినుత కోటాకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు

శ్రీకాళహస్తి: చిందేపల్లె గ్రామ రహదారికి అడ్డంగా ఈసీఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యం గోడ కట్టడంపై గత మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినుత కోటా దీక్షను పోలీసులు భలవంతంగా భగ్నం చేయడం జరిగినది.. ఈ సందర్భంగా వినుత కోట కు అండగా మదనపల్లి నియోజకవర్గం నుంచి మీకు ఎప్పుడు అండగా ఉంటాం అంటూ రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఐటీ కార్డినటర్ జగదీశ్, మండల ప్రెసిడెంట్ గ్రానైట్ బాబు, నారాయణ మరియు జనసైనికులు వీరమహిళలు వినుత కోటాను కలసి, ఆమెకు మద్దతు తెలపడం జరిగినది.