ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాలవికాస్ విద్యార్థులకు విద్యాసామాగ్రి వితరణ

రాజంపేట మన్నూరు హై స్కూల్ నందుగల ఫిజికల్ ఛాలెంజర్స్ కి, మన్నూరులోని హాస్టల్ విద్యార్థులకు జనసైనికులు విద్యాసామాగ్రి పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతారామపురం పంచాయతీ జనసేన నాయకులు కోడూరు సాయి, పులి శివరామకృష్ణ, పొగడతోటి సాయికృష్ణ టీం మరియు రాజంపేట జనసేన నాయకులు నంద్యాల హరి పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పిల్లలకు విద్యాసామాగ్రి అందించడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందజేసిన రాజంపేట జనసేన నాయకులు పోబోలు బాలసాయికృష్ణకి కృతఙ్ఞతలు తెలియచేసారు.