పీలేరులో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పీలేరు, జనసేన పార్టీ 11 వ ఆవిర్భావ వేడుకలు గురువారం పీలేరు మండలం, శివరామపురం బెస్తపల్లిలో పీలేరు జనసేన మరియు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి కలప రవి, పీలేరు మండల అధ్యక్షులు వల్లెపు మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో అత్తహసంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో జనసేన- తెలుగుదేశం- బీజేపీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అని పీలేరులో నల్లారి కిషోర్ ని అసెంబ్లీలో చూడటమే మా నాయకుల ప్రధమ లక్ష్యం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు నారే సతీష్ కుమార్, సుభాష్, జనసేన నాయకులు గురు మోహన్, గజేంద్ర, విగ్నేష్, రెడ్డి ప్రసాద్, గణేష్, రాజేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.