పెయింటింగ్ వర్క్ చేస్తూ గాయపడిన వ్యక్తికి జనసేన అండ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలంలో భగత్ సింగ్ నగర్ కు చెందిన తాళ్ల శ్రీను పెయింటింగ్ వర్క్ చేస్తున్న సమయంలో బిల్డింగ్ పైనుంచి జారి పడడంతో తన ఎడమ చేయి విరగడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా మరియు మండల నాయకులు తాళ్ల శ్రీను పరామర్శించి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొనగా.. తాళ్ల శ్రీను కు సర్జరీ నిమిత్తం సుమారు లక్ష రూపాయల ఖర్చు అయ్యాయి అని తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో మండలంలో ఉన్న జిల్లా మరియు మండల నాయకులు కార్యకర్తల సహకారంతో మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. సమాజ సేవలో జనసేన పార్టీ ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల వీరభద్రఒ, గరిక రాంబాబు, మండల నాయకులు తాటికొండ ప్రవీణ్, బొక్క వెంకటేశ్వర్లు గ్రామ కమిటీ నాయకులు నూతి సాయి, దేవా, అలుగుల శ్రావణ్, మోటా సుధాకర్, డాక్టర్ రఫీ పాషా, బర్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.