విన్నా వాసు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

రాజమహేంద్రవరం, స్థానిక 36 వ వార్డు జనసైనికుడు దుర్గాప్రసాద్ కు రెండు నెలల కిందట ప్రమాదం జరిగి తలకు గాయం అయింది.
అతని కుటుంబానికి నెలరోజులు సరిపడా నిత్యవసర సరుకులు జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి విన్నా వాసు మరియు వారి మిత్రబృందం సహకారంతో అనుశ్రీ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర ఇంచార్జ్ వర్యులు అనుశ్రీ సత్యనారాయణ దుర్గాప్రసాద్ కు 5,000/-రూపాయల నగదు ఆర్థిక సాయం అందించారు. అనుశ్రీ సత్యనారాయణ గతంలో కూడా దుర్గా ప్రసాద్ కు 5,000/-రూపాయల నగదు ఆర్ధిక సహాయం చేశారు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ విన్నా వాసు మరియు వారి మిత్రబృందం చేసినటువంటి ఈ సేవా కార్యక్రమం వల్ల ఇంకొంతమంది ముందుకు వచ్చి తగు సహాయం అందించే అవకాశం ఉందని అన్నారు వాసు మరియు వారి మిత్రబృందం చేసిన ఈ సేవా కార్యక్రమం మరువలేనిదని కొనియాడారు. జనసేన పార్టీ దుర్గా ప్రసాద్ కు అండగా ఉంటుందని, అదైర్యపడవద్దని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించవచ్చు అని అనుశ్రీ అన్నారు. నగర కార్యదర్శి విన్నావాసు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయం అందించిన నాగు, అశ్విని రాజు, లీల, నాగేంద్ర, ప్రసాదు ఉమా శంకర్, టైలర్ కృష్ణ, సురేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి గడ్డం నాగరాజు, నగర కార్యదర్శి అల్లాటి రాజు, నగర సంయుక్త కార్యదర్శులు ఫణి, ఠాగూర్,మరియు జనసైనికులు వెంకటేష్, సురేష్, శివ, నాయుడు, సాయి తదితరులు పాల్గొన్నారు.