దమ్ముంటే ప్రజల కష్టాలు తీర్చండి !

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కంబాల రాయుడు పేటలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ, ఆత్మీయ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్యనారాయణ, పేడాడ రామ్మోహన్ రావు విచ్చేశారు, గ్రామ జనసైనికులు మరియు మూగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం నచ్చి ఆ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీ కండువా వేసుకుని బొలిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.