ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ: జమ్ము

చీపురుపల్లి, మంగళవారం మూడు రోడ్లు కూడలి వద్ద జనసేన పార్టీ నాయకులు జమ్ము ఆదినారాయణ ఆధ్వర్యంలో మరియు జనసేన పార్టీ నాయకులు జనసైనికులు జనసేన అభిమానులు కలిసి శ్రీ సిద్ధి వినాయక పూజ మహోత్సవ సందర్భంగా కాలుష్య నియంత్రణ జరగాలని ఆశిస్తూ మట్టి వినాయకులు విగ్రహాలను భారీ ఎత్తున వందల సంఖ్యలో ఉచితంగా ఇచ్చి అందరిని బాగుండాలని అందులో మేము ఉండాలని జనసైనికులు అభిలషించడం జరిగింది. సెప్టెంబర్ రెండవ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నేడు మట్టి విగ్రహాల పంపిణీ భారీ సంఖ్యలో పంపిణీ చేయడం జరిగింది. అలాగే వినాయక చవితి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని తెలిపారు. 1వ తేదీన వివిధ ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమం పచ్చదనం పరిశుభ్రత మరియు కాలుష్య నివారణ నియంత్రణ కొరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నామని తెలియపరుచుటకు సంతోషిస్తున్నాం. రెండవ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పండగ రోజుగా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం గుజ్జంగివలస గ్రామంలో ఉదయం 10 గంటలకు ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభించబడును. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడును. ఇందులో భారీ ఎత్తున జనసైనికులు రక్తదానం చేయగలమని సాయంత్రం 6 గంటలకు గుజ్జంగవలస గ్రామంలో భారీ ఎత్తున జన సందోహంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజులు వేడుకలు జరుపబడును. కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఏమన్న మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గరివిడి మండలం, నాయుడు జనసేన, జగదీష్, ఏసు, బాల, శంకర్, శ్రీరామ్, రమణ, చీపురుపల్లి మండలం సురేష్, రామలింగపురం నాయుడు, మెరకముడిదాం మండలం రాము నాయుడు, కుమార్, గుర్ల మండలం రమేష్ శంకర్, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.