హిందూపురంలో వైభవంగా క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

హిందూపురం నియోజకవర్గం, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలోని లేపాక్షి మండల అధ్యక్షుడు బాలాజీ మరియు లోకేష్ ఆధ్వర్యంలో హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొని హిందూపురం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వాలంటీర్లను ఘనంగా సన్మానించి క్రియాశీలక సభ్యత్వాలు చేయించుకున్న జనసైనికులకు కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఎల్.ఐ.సి రమణ, సంయుక్త కార్యదర్శి కొల్లకుంట శేఖర్, హిందూపురం చిలమత్తూరు మండల అధ్యక్షులు చక్రవర్తి, చిన్నా ప్రవీణ్, జిల్లా కార్యనిర్వాహక సభ్యులు అగ్గి శీన, నాగరాజు మరియు హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల కమిటీ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.